కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

హైదరాబాద్: మనుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నోటీసులు జారీ చేసింది. రాజగోపారెడ్డి దాదాపు రూ. 5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంక్ ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా మునుగోడు ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఇందుకు సంబంధించి పలు పత్రాలను ఈసీకి సమర్పించారు. ఆ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోకముందే 22 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని ఆయన కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహా భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Election commission notices to komatireddy Rajagopal reddy on transfer of Rs 5.24 crores

టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. రాజగోపాల్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటల్లోగా సమాధానం చెప్పాలని, వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాదని నిరూపించుకోవాలని పేర్కొంది.

కాగా, టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ నగదు బదిలీపై ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి కొట్టిపారేశారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని హండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+