ఇక కరోనా అంతమే!: చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం
హైదరాబాద్: నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం ఉదయం ఒక అద్భుతం జరిగింది. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకుడు సురేష్ మహరాజ్.. స్వామివారి సన్నిధిలో కూర్మ మూర్తి(తాబేలు) ఉండటాన్ని చూసి వెంటనే ప్రధాన అర్చకులు రంగరాజన్కు తెలిపారు.

ఏ దారి లేకున్నా.. ఆలయంలో కూర్మమూర్తి ప్రత్యక్షం..
ఆయాలనికి వచ్చిన ప్రధాన అర్చకులు ఆ తాబేలును చూసి ఆశ్చర్యపోయారు. దేవాలయంలోకి కూర్మ మూర్తి(తాబేలు) లోపలికి ప్రవేశించడానికి ఎలాంటి దారీ లేదని, అయినా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని రంగరాజన్ చెప్పారు. ఈ కూర్మమూర్తి ఆలయ ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తోందని అన్నారు.

అమృతం లభించినట్లే.. ఇక కరోనా అంతమే..
కూర్మావతారం ఉద్దేశం క్షీరసాగర మథనం, పూర్వం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మరూపంలో వచ్చిన మహా విష్ణువుపైనే మేరు పర్వతాన్ని కవ్వంగా ఉంచి వాసుకి సాయంతో ఒక దేవతలు, మరోవైపు అసురులు మదించారు.ఇప్పటి కూడా కరోనా ఔషధం కోసం ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. సాగర మథనంలో హాలహలం వచ్చింది.. దానిని పరమశివుడు స్వీకరించాడు. అలాగే కరోనా నుంచి మనకు తొందరగా విముక్తి లభించబోతోందన్నారు. మనకు అమృతం(కరోనా ఔషధం) దొరకబోతోందనేది సారాంశమని, ఇది అందరికీ శుభవార్తేనని రంగరాజన్ వ్యాఖ్యానించారు.

శ్రీవారే సూచించినట్లుగా..
ఇలాగే నేడు చిలుకూరులో సుందరేశ్వరస్వామి సన్నిధిలో కూర్మమూర్తి(తాబేలు) ప్రత్యక్షమవడం అంటే త్వరలోనే లోకం నుంచి ఈ కరోనా మహమ్మారి వైరస్ అంతమై అమృతం లభిస్తుందని సాక్షాత్తూ ఆ వేంకటేశ్వరస్వామి సూచిస్తున్నట్లుగా ఉందని అర్చకులు తెలిపారు.
Recommended Video

తొందరలోనే మంచి ఫలితం..
వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నింటికీ తొందరలో మంచి ఫలితం వస్తుందని ప్రధాన అర్చకులు రంగరాజన్ వ్యాఖ్యానించారు. కాగా, ఆలయంలోకి వచ్చిన ఈ తాబేలు 10 సెంటిమీటర్ల పొడవు, ఆరు సెంటిమీటర్ల వెడల్పు ఉందని అర్చకులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications