దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. హైదరాబాద్లో ఎక్కడంటే..?
సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ లో ఇప్పటికే రకరకాల టెక్నాలజీతో కూడిన సినిమా థియేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రసాద్ ఐమాక్స్, ఏఎంబీ సినిమాస్, ఎపిక్ స్క్రీన్, లాంటి థియేటర్లు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు సినిమా అంటే ఎంత ప్రేమో తెలిసిందే. అటు ఓటీటీ అయినా థియేటర్ అయినా సినిమాను అభిమానిస్తారు. ఈ క్రమంలో సినీ అభిమానులకు ఓ శుభవార్త. అల్లు సినిమాస్.. దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ సినిమా స్క్రీన్ ను హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
సినిమా లవర్స్ మరో గుడ్ న్యూస్. మాస్ మహారాజ రవితేజ ఇటీవల హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఏఆర్ టీ సినిమాస్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఎపిక్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో తొలి ఎపిక్ స్క్రీన్ ఇదే కావడం విశేషం. ఇప్పుడు మరో అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్ లో తొలి స్క్రీన్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు అల్లు సినిమాస్.. దేశంలోనే అత్యంత పెద్దదైన డాల్బీ సినిమా స్క్రీన్ ను హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు స్పష్టం అవుతోంది. భాగ్య నగర ప్రజలకు సరికొత్త సౌండ్ సిస్టమ్ తో ఊహించని అనుభూతిని పంచనుంది. ఈ మూవీని సరికొత్త విధంగా ఆస్వాధించేందుకు పిచ్- బ్లాక్ స్టేడియం సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ డాల్బీ సినిమా స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పుతో ఉండనుంది. అత్యుత్తమ విజువల్స్ కోసం ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డీ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనికి తోడు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ను కూడా జతచేస్తున్నారు. వీక్షకులకు ఎలాంటి ఆటంకం లేకుండా సినిమాను ఆస్వాదించేందుకు 'పిచ్- బ్లాక్ స్టేడియం సీటింగ్' ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి డిసెంబర్ 19న రిలీజ్ కానున్న అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ద్వారా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇక ఈ డాల్బీ టెక్నాలజీని ఆస్వాధించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications