బ్యూటీషియన్ శిరీష మృతిపై కేసీఆర్కు నివేదిక, అందులో ఏముందంటే...
ఫిలిం నగర్లో ఆర్జీఏ స్టూడియోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష ఘటనలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నివేదిక అందచేసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్: ఫిలిం నగర్లో ఆర్జీఏ స్టూడియోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష ఘటనలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నివేదిక అందచేసినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రికి అందజేసిన నివేదికలో శిరీషది అనుమానాస్పద మృతిగా పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక, విచారణలో లభించిన ఆధారాలతో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే.

శిరీష ఆత్మహత్యకు ప్రధాన కారణం రాజీవ్, శ్రావణ్లు అని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిన అనంతరం, మధ్యాహ్నం పోలీసులు ఈ కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
అనంతరం గురువారం మధ్యాహ్నం పోలీసులు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యేనని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు.
శిరీషకు వల్లభనేని రాజీవ్ కుమార్తో శారీరక సంబంధం ఉందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అయితే బెంగళూరుకు చెందిన తేజస్వి ఇటీవల రాజీవ్కు పరిచయం కావడం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవడంతో.. విభేదాలు వచ్చాయి.
రాజీవ్తో శిరీష సంబంధాన్ని ఆయనను పెళ్లి చేసుకోవాలనుకున్న తేజశ్రీ నిలదీసింది. దీనిపై గొడవ జరిగింది. సర్దుబాటు కోసం కుకునురుపల్లి వెళ్లారు. ఆ సమయంలో గొడవ జరిగింది. శిరీష పట్ల ఎస్సై అనుచితంగా ప్రవర్తించారు. ఆ తర్వాత రాజీవ్, శ్రవణ్ ఆమెను కొట్టడం, హైదరాబాదు వచ్చాక శిరీష ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications