చేయి దాటిపోతుంది: రోహిత్ ఆత్మహత్య మోడీకి ఫరూఖ్ హెచ్చరిక
జమ్మూ: దళిత విద్యార్తి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో సంభవించిన పరిణామాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి చేతులు దాటిపోతుందని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించారు.
అది విషాదకరమైన సంఘటన అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలోనైనా, తాము కోరుకున్న స్థాయిలోనైనా సంఘటనపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. సత్వరమే విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా యువ విద్యార్థులు అశాంతికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

సమస్యను పరిష్కరించకపోతే నిరసనలు ప్రమాద స్థాయికి చేరుకుంటాయని, అప్పుడు నియంత్రించడం కష్టమవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 17వ తేదీన వేముల రోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications