రాజేంద్రనగర్లో దారుణం... కన్నతండ్రే కాటేశాడు... కుమార్తెపై 15 రోజులుగా అత్యాచారం...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణం వెలుగుచూసింది. కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.గత 15 రోజులుగా కూతురిపై అతను అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.తండ్రి అత్యాచారం విషయాన్ని బాధిత యువతే మొదట స్థానికులకు చెప్పినట్లు తెలుస్తోంది.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తరహా రెండు వేర్వేరు ఘటనలు వెలుగుచూశాయి. విజయవాడ అజిత్ సింగ్ నగర్కు చెందిన 35 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ 13 సంవత్సరాల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాది మార్చి నెల నుంచి కన్నబిడ్డపై అతను అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ విషయం తల్లికి చెప్పలేక, తండ్రి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురై తనలో తానే కుమిలిపోయింది.

ఈ నెల 8,10 తేదీల్లో కుమార్తెపై అతను అత్యాచారానికి పాల్పడటంతో... ఆమె తమ నానమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ నానమ్మకు జరిగిన విషయం చెప్పింది.తండ్రి ఏడాదిన్నరగా తనపై చేస్తున్న రాక్షస కృత్యాన్ని బాలిక నానమ్మకు చెప్పగా ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేసి కేసును దిశ పోలీస్ స్టేషన్కు బదలాయించారు.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.
అంతకుముందు,మరో ఘటనలో విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్తో పాటు మరో ఇంజినీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.కొన్నేళ్ల క్రితం అతను ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది.అయితే, కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ తండ్రి.. అత్యంత నీచపు పనికి ఒడిగట్టాడు. కన్న కూతురిపైనే కన్నేసిన ఆ నీచుడు భార్య ఇంట్లో లేని సమయంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుషం తర్వాత చిన్నారి తీవ్ర బాధతో విలవిల్లాడిపోతుండటంతో తల్లికి అనుమానం వచ్చింది. తర్వాత, ఈ కీచక తండ్రిని నిలదీయడంతో అతడు చేసిన నీచపు పని బయటపడింది.
Recommended Video
ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడటాన్ని ఆ మహిళ జీర్ణించుకోలేకపోయింది. భర్త అకృత్యంపై సదరు మహిళ దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ తండ్రిపై పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.తండ్రి చేతిలో లైంగిక దాడికి గురైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే భర్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని చిన్నారి తల్లికి బెదిరింపులు రావడం గమనార్హం. అయినప్పటికీ ఆమె తన కూతురికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడు చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు కూడా యత్నించాడు. దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications