హృదయ విదారకం: 65కిలోమీటర్లు బైక్ పై బాలిక మృతదేహం తరలింపు.. ఖమ్మంజిల్లాలో అమానవీయం!!
ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక గిరిజన బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. అంబులెన్స్ కు డబ్బులు కూడా లేకపోవడంతో, తల్లిదండ్రులు ఆ బాలిక మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన చోటు చేసుకుంది. 65 కిలోమీటర్ల మేర బాలిక మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన చూసిన వారందరిని కంటతడి పెట్టించింది.

మూడేళ్ళ గిరిజన బాలికకు అనారోగ్యం.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామం లో ఆదివాసి కుటుంబానికి చెందిన వెట్టి మల్ల, ఆది దంపతుల కుమార్తె అయిన మూడు సంవత్సరాల బాలిక వెట్టి సుక్కి జ్వరంతో పాటు ఫిట్స్ రావడంతో ఆమెను ఏనుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలికను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాలిక మృతి .. అంబులెన్స్ లో బాలిక మృతదేహం తరలింపుకు వేడుకోలు
ఇక ఆసుపత్రిలో చేర్పించిన చిన్నారికి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం నాడు వైద్య చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు, బిడ్డ మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వారిని మరింత బాధ పెట్టింది. 65 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవలసి ఉన్నవారు బాలిక మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ పంపించాలని ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నారు.
డబ్బులు లేక మృతదేహాన్ని బైక్ పై తరలించిన తల్లిదండ్రులు
అంబులెన్స్ పంపించడం కుదరదని, మృతదేహాన్ని మీరే తీసుకువెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఇక అంబులెన్స్ లో తరలించడానికి, అంబులెన్స్ సిబ్బంది డబ్బులు ఖర్చవుతాయని చెప్పారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని సదరు తల్లిదండ్రులు, బాలిక మృతదేహాన్ని బంధువుల వద్ద బైక్ తీసుకుని తరలించడానికి నానా అగచాట్లు పడ్డారు. మరణించిన బాలిక మృతదేహాన్ని ఖమ్మం నుంచి కొత్త మేడేపల్లి గ్రామానికి బైక్ పై తరలించారు.

65 కిలోమీటర్ల దూరం బైక్ పై బాలిక తరలింపు.. అమానవీయ ఘటన
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మానవత్వం చూపించక పోవడంతో, 65 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని తీసుకొని బాలిక తల్లిదండ్రులు బైక్ పై వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గిరిజన కుటుంబమైన తమకు మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. దీంతో బైక్ పైనే మృతదేహాన్ని 65 కిలోమీటర్ల మేర తరలించి తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాలిక మృతదేహాన్ని బైక్ పై తరలించిన హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications