Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాదద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం.. నిలిచిన విద్యుదుత్పత్తి, జరిగిందిదేనా!

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్ల లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నేడు తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్లో మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లోని బాయిలర్ నుండి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయని సమాచారం.

యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
ఇక ఇదే సమయంలో దిగువన వెల్డింగ్ పనులు కొనసాగుతున్న క్రమంలో లీకైన ఆయిల్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగసి పడ్డాయని సమాచారం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగ ప్రవేశం చేసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో కొన్ని కేబుల్స్ కాలిపోగా ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

fire accident in yadadri thermal power station this is the reason

థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1 ట్రయల్ రన్ లో అపశ్రుతి
అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఫైనల్ గా మంటలను అదుపులోకి తీసుకు రాగలిగారు. ఈ సంఘటన కారణంగా మొదటి యూనిట్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1 ప్రారంభించడానికి అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇక ఈ దుర్ఘటన పైన దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీస్ అధికారి పిటిఐకి తెలిపిన వివరాల ప్రకారం

ఎలాంటి ప్రాణ నష్టం లేదు
నల్గొండ జిల్లాలోని యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ యొక్క యూనిట్ ఒకటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఇది తెల్లవారుజామున ఒంటిగంట, ఒకటిన్నర ప్రాంతంలో సంభవించిందని, ఈ ఘటనలో కొన్ని కేబుల్స్ మాత్రమే కాలిపోయాయి అని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఫిబ్రవరిలోనూ ప్రమాదం
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు ఐదు యూనిట్లు ఉన్నాయి. ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. గత ఏడాది యూనిట్ రెండు పూర్తి కాగా, ఇక ప్లాంట్లో కొనసాగుతున్న మొత్తం పనులు 2025 మధ్య నాటికి పూర్తవుతాయని గతంలోనే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా యాదాద్రి పవర్‌ప్లాంటులో ప్రమాదం జరిగింది. యాష్‌ ప్లాంట్‌ ఈఎస్‌పీ వద్ద ఆరుగురు కార్మికులు కాలిన బూడిద పడటంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+