ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ ? ఆయన ఇంట్లోనే- హైకోర్టులో బయటపెట్టిన ఈడీ..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇవాళ కీలక మలుపు చోటు చేసుకుంది. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్లపై జరుగుతున్న విచారణలో భాగంగా తొలిసారి ఈ కేసులో ఆమె తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు బయటికి వచ్చింది. ఈ మేరకు ఈడీ తొలిసారి కేసీఆర్ పేరును ఇవాళ ఢిల్లీ హైకోర్టులో ప్రస్తావించింది.

former Telangana cm kcr name in delhi liquor scam ed mentioned in delhi high court

ఢిల్లీ మద్యం స్కాంలో నిందితురాలిగా ఉన్న కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ఇందులో లిక్కర్ స్కాంలో ఆమె తండ్రి కేసీఆర్ పాత్రపై ఈడీ వివరించింది. లిక్కర్‌ స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్‌ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్‌కు కవిత ముందే వివరాలు చెప్పినట్లు ఈడీ వెల్లడించింది.

ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే కవిత సౌత్ లాబీతో లిక్కర్ స్కాంపై చర్చలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఈ మేరకు తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్‌కు ఆయన అధికారిక నివాసంలో కవిత పరిచయం చేశారని ఈడీ పేర్కొంది. కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారని తెలిపింది. దీంతో తదుపరి దర్యాప్తులో కేసీఆర్ ను ఈడీ విచారిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+