స్కూల్లో దారుణం: 4వ తరగతి విద్యార్థినికి వాచ్మెన్ లైంగిక వేధింపులు..
అబిడ్స్ లోని సుజాత స్కూల్లో ఓ విద్యార్థిని నాలుగో తరగతి చదువుతోంది. స్కూల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది.
హైదరాబాద్: దేశంలో మహిళలపై వేధింపుల ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని ఓ కార్పోరేట్ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థినిపై కాలేజీ వాచ్ మెన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. అబిడ్స్ లోని సుజాత స్కూల్లో ఓ విద్యార్థిని నాలుగో తరగతి చదువుతోంది. స్కూల్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది.

అసభ్య సైగలు చేస్తూ ఇబ్బందిపెడుతున్నాడని పేర్కొంది. దీంతో బాలిక తల్లిదండ్రులు విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అబిడ్స్ పోలీసులను ఆశ్రయించి బాలిక తల్లిదండ్రులు కేసు నమోదు చేయించారు.
బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు వాచ్మెన్పై కేసునమోదు చేసి రిమాండ్కు తరలించారు. కార్పోరేట్ స్కూళ్లలో బాలికలపై వేధింపుల ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. యాజమాన్యం స్పందించకపోవడంపై వారు మండిపడుతున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications