మంత్రి సబితా ఇంద్రారెడ్డి పీఏలమంటూ ఘరానా మోసం.. ఓ ప్రముఖ సంస్థకు టోకరా!!
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పీఏలమంటూ మంత్రి పేరు చెప్పు కొంతమంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. హర్యానా రాష్ట్రంలోని కర్నైల్ పట్టాణానికి చెందిన లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ 2019లో తెలంగాణా రాష్ట్రంలో అమలవుతున్న సర్వ శిక్షా అభియాన్ లో భాగంగా స్కూల్ చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్, షూస్ పంపిణీకి సంబంధించిన ఆర్డర్ తమకు కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.
గతంలో సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసిన కొందరు తాము సబితా ఇంద్రారెడ్డి పీఏలమంటూ లిబర్టీ సంస్థ ప్రతినిధి కమల్ ధవన్ కు ఫోన్ చేసి డీల్ చేసుకుందాం రమ్మని హైదరాబాద్ పిలిచారు. విద్యాశాఖామంత్రి పర్సనల్ అసిస్టెంట్ ను అంటూ జీ.కే కుమార్, సెకండ్ పర్సనల్ అసిస్టెంట్ అంటూ బెల్లి తేజ, పొలిటికల్ సెక్రటరీ అంటూ ప్రవీణ్ వర్మ లిబర్టీ ప్రతినిధిని పిలిచి ఈ కాంట్రాక్ట్ వారికే ఇస్తామని చెప్పారు.

అందుకు ప్రాసెసింగ్ ఫీజులతో పాటు, ఇతర చార్జీల క్రింద 17.66లక్షల రూపాయలను వసూలు చేశారు. వివిధ ఖాతాలకు ఆ డబ్బులు బదిలీ చేయించారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు లిబర్టీ సంస్థ తమకు కాంట్రాక్ట్ వస్తుందని చూసినా ఆ ఆర్డర్ వారికి రాలేదు. దీంతో అసలు తమవద్ద డబ్బులు వసూలు చేసిన వారి గురించి తెలుసుకోగా జీ.కే కుమార్ గతంలో మంత్రి పీఏగా పనిచేశారని, కానీ ప్రస్తుతం పని చేయటంలేదని తెలిసింది.
దీంతో తమను మోసం చేసిన సదరు వ్యక్తులపై లిబర్టీ షూస్ లిమిటెడ్ ప్రతినిధి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఏడుగురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీ.కే కుమార్, బెల్లి తేజ, ప్రవీణ్ వర్మ, స్వాతి, ఆంజనేయులు, రమేష్ రెడ్డి, విక్రమ్ పురి తదితరులపై ఐపీసీ 406, 420 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏకంగా మంత్రి పేరే చెప్పుకుని ఘరానా మోసానికి పాల్పడిన నేరస్తులపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఎదుటి వారి అవసరాలను అవకాశాలుగా మార్చుకుని మోసం చేసే వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అందుకే ఇలాంటి వారిపట్ల తస్మాత్ జాగ్రత్త.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications