Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆర్టీసీ.. మహిళలకే కాదు వారికి బస్సులు ఫ్రీ!

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సేవలలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో మహిళలు, బాలికలు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో తెలంగాణ సరిహద్దులలోపు ఎక్కడి నుంచైనా జీరో టికెట్‌తో ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకైతే సరిహద్దు వరకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.

మహిళలకే కాదు వారికి ఫ్రీ బస్సులు

మహిళలకు మాత్రమే కాదు కొందరు పురుషులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ పురుషులు, బాలురకు కూడా ఈ సౌకర్యం కల్పించాలంటూ కొంతకాలంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న వేళ తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీలో కూడా ప్రభుత్వం దివ్యాంగులకు ఇంద్రధనుస్సు పేరుతో నిన్నటి నుండి ఉచిత బస్సు ప్రయాణాలను ప్రారంభించింది.

free buses for disabled in telangana state good news said by cm revanth reddy and tgsrtc for pwds

జీరో టికెట్ తోనే వారికి ప్రయాణ సేవలు

తాజాగా దివ్యాంగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, రాష్ట్ర దివ్యాంగ పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో 100శాతం ఉచిత ప్రయాణం కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దివ్యాంగ పురుషులు టికెట్ ధరలో 50శాతం రాయితీతో ప్రయాణం చేసేవారు. ఉదాహరణకు, రూ. 50 టికెట్‌కు రూ. 25 చెల్లింపు చేయాల్సి ఉండేది. ఇప్పుడు మహిళల మాదిరిగా జీరో టికెట్‌తో ఎలాంటి చెల్లింపులు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్.

హర్షం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు

రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం తమకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుందని వారు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమయ్యాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 25-30 లక్షలున్న ప్రయాణాలు తాజాగా 60 లక్షలకు చేరాయి.

హైదరాబాద్ కు ఖమేనీతో సంబంధం.. ఏకంగా ఆ పేరు మీద రోడ్డే!
హైదరాబాద్ కు ఖమేనీతో సంబంధం.. ఏకంగా ఆ పేరు మీద రోడ్డే!

బాగా పెరిగిన ఆర్టీసీ రద్దీ

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో పెరిగిన రద్దీ దృష్ట్యా ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈవీ బస్సులు పలు మార్గాల్లో నడుస్తుండగా, త్వరలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే మహిళా సంఘాల ద్వారా కొన్న అద్దె బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+