నాపై జరిగిన కాల్పుల ఘటనపై విచారణ చేయాలి: గద్దర్ డిమాండ్
హైదరాబాద్: కోదండరామ్ పార్టీకి ప్రజల్లో స్థానం ఉందో తెలియదుగానీ, తాను ఏర్పాటు చేసిన పార్టీకి ప్రజల మద్దతు ఉందని ప్రజా యుద్దనౌక గద్దర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సోమవారం నాడే తన పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.

మంగళవారం నాడు తెలంగాణ సెక్రటేరియట్లో సీఎస్ ఎస్కె జోషీని కలిసేందుకు గద్దర్ వచ్చారు. సీఎస్ లేకపోవడంతో సీఎంఓలో వినతిపత్రం ఇచ్చారు. తనపై కాల్పులు జరిగి సుమారు 22 ఏళ్ళు అవుతోందని గద్దర్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయమై విచారణను కోరుతూ తాను రాష్ట్రపతికి కూడ లేఖ రాసినట్టుగా ఆయన గుర్తు చేశారు.తనకు లేఖకు స్పందించిన రాష్ట్రపతి ప్రధానికి కూడ లేఖ రాశారని చెప్పారు.
ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని కార్యాలయం నుండి సీఎస్కు లేఖ వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మీనమేషాలు లెక్కిస్తోందని గద్దర్ ఆరోపించారు.
తనపై కాల్పుల ఘటనకు సంబంధించి ప్రభుత్వం స్పందించకపోతే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని గద్దర్ ప్రకటించారు.గద్దర్ ఆరు మాసాల క్రితం ఓ పార్టీని ఏర్పాటు చేశారు.ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆయన పర్యటిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications