కవిత బంగారు బోనం: అమ్మవారిని దర్శించుకున్న పవన్, ఫ్యాన్స్తో పోలీసుల తంటాలు
భాగ్యనగరం: లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలంగాణ సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు ఆదివారం దర్శించుకున్నారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. ఆయనకు ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ దంపతులు అమ్మవారికి పూజలు చేశారు.
కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. pic.twitter.com/YaRaYSwAtj
— Telangana CMO (@TelanganaCMO) July 29, 2018
ఆయన వెంట మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు, వేకువజామున నాలుగు గంటలకు తలసాని కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఆ తర్వాత ఎంపీ కవిత బంగారు బోనంతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆమె వెంట 1008 మంది భక్తులు బోనాలతో వచ్చారు.
కవిత ఆదయ్యనగర్లో బంగారు బోనం ఎత్తుకుని మహంకాళి ఆలయానికి బయలుదేరారు. ఆదయ్య నగర్, సిటీలైట్ హోటల్, ఆర్మీ రోడ్డు, సుభాష్ రోడ్డు మీదుగా వచ్చారు. బంగారం బోనం వద్ద వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మాదేవేందర్ రెడ్డి పూజలు నిర్వహించారు.
Participated in Bonalu festival celebrations at Mahankali Temple. pic.twitter.com/H6cHNfFuUP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 29, 2018
బంగారు
బోనం
ఇలా
తయారు
చేశారు
అమ్మవారికి
భక్తులు
సమర్పించిన
మిశ్రమ
బంగారంతో
ఈ
బంగారు
బోనాన్ని
తయారు
చేయించారు.
3
కేజీల
80
గ్రాముల
బంగారాన్ని
ఈ
బోనం
తయారీకి
ఉపయోగించారు.
రెండు
బంగారు
పాత్రలు,
ఒక
బంగారు
ప్రమిదను
బంగారు
బోనం
కోసం
రూపొందించారు.
ఈ
పాత్రలపై
మొత్తం
285
వజ్రాలను
అలంకరించారు.
అమ్మవారిని దర్శించుకున్న పవన్
మహంకాళీ అమ్మవారిని జనసేన అధినేత పవన్ దర్శించుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అభిమానుల్ని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పవన్ కారు గ్లాస్ ప్రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు చాలామంది ఎగబడ్డారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు చేశారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోడానికి దేవస్థానానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. pic.twitter.com/e1DTqcB9QV
— JanaSena Shatagni | 9394022222 (@JSPShatagniTeam) July 29, 2018
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన జనసైనికులకు, భక్తులకు అభివాదం చేస్తున్న జనసేనాని! pic.twitter.com/EZj6r5gXGA
— JanaSena Shatagni | 9394022222 (@JSPShatagniTeam) July 29, 2018