ఏపీ, తెలంగాణను కలిపే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీపై అదిరిపోయే అప్డేట్!
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనులలో దూకుడు పెరిగింది. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 జి మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి ప్రాజెక్టు. ప్రస్తుతం దీనికోసం వరంగల్ జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు మంచిర్యాల నుండి వరంగల్ వరకు నిర్మించబడుతుంది. ఇప్పటికైనా రహదారులను విస్తరించకుండా పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేయని భూమిలో నిర్మించబడుతున్న హైవే ఇది.
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల భూసేకరణ పనుల పురోగతి
ఈ ప్రాజెక్టు ప్రధాన మంత్రి గతి శక్తి పథకంలో భాగంగా నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి సంబంధించి తాజాగా ఒక శుభవార్త వరంగల్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో నేడు ఏర్పాటు చేసిన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల భూసేకరణ పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కీలక విషయాలు వెల్లడించారు.

మంచిర్యాల్ వరంగల్ ఖమ్మం జిల్లాల ను కలుపుతూ నేషనల్ హైవే
అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిఆర్వో విజయ లక్ష్మి , ఆర్డిఓ నర్సంపేట ఉమారాణి నేషనల్ హైవే బ్రిడ్జ్ మేనేజర్ తదితరుల తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో ఈ నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ మంచిర్యాల్ వరంగల్ ఖమ్మం జిల్లాల ను కలుపుతూ నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుందన్నారు.
భూసేకరణ దాదాపు పూర్తి
మొత్తం 176.52 హెక్టార్ల ల్యాండ్ అక్విజేషన్ కు గాను ఇప్పటివరకు 171.34 హెక్టార్ల ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయిందన్నారు.పెండింగ్ అవార్డును నవంబర్ 10 వరకు పూర్తి చేయాలని సంబంధిత ఆర్డీవోలను అధికారులను ఆదేశించారు. 22.02 హెక్టార్ల భూసేకరణ కోర్టు కేసుల తో పెండింగ్లో ఉందని, ఇప్పటివరకు పేమెంట్ అయి అవార్డ్ పాస్ అయిన కేసులలో మ్యుటేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హన్మకొండ, వరంగల్ జిల్లాలలో భూసేకరణ ఇలా
భూమి కోల్పోయిన రైతుల నష్టపరిహారం త్వరిత గతిన చెల్లించి ల్యాండ్ అక్విజిషన్ త్వరగా పూర్తిచేయాలని అన్నారు. హన్మకొండ జిల్లాలో కూడా భూసేకరణను అధికారులు పూర్తిచేశారు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టులో భాగంగా పరకాల డివిజన్ పరిధిలోని పరకాల, దామెర, శాయంపేట మండలాలకు చెందిన 10 గ్రామాల రైతులకు సంబంధించి భూములను సేకరించి, వారికి కూడా పరిహారాన్ని చెల్లించారు. రెండు జిల్లాల్లోనూ భూసేకరణ పూర్తయితే ఆపై డి పి ఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ పనులను చేయనున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications