తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!
కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రైతాంగానికి శుభవార్త చెప్పింది. తెలంగాణ రైతులు పండించిన పప్పుధాన్యాలు, నూనెగింజలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇక ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర రైతులకు గణనీయమైన లాభం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
పప్పుధాన్యాలు, నూనెగింజలను కొనుగోలు చేయనున్న కేంద్రం
దీంతో తెలంగాణలో రైతులు పండించిన ఒక లక్షా 25 వేల 855 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 894 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

రైతులకు మేలు చేసేలా కేంద్ర నిర్ణయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి మోదీకి, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతులకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
రైతులకు మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్న కేంద్రం
2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన పంటలను భారీ స్థాయిలో కొనుగోలు చేస్తోందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 70 వేల కోట్ల రూపాయల విలువైన పత్తిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసిందని చెప్పారు.
రైతుల సంక్షేమమే కేంద్రానికి ప్రాధాన్యం
ఈ చర్యల వల్ల తెలంగాణ రైతులకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధర లభించేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, భవిష్యత్తులో కూడా రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రైతుల విషయంలో కేంద్ర లక్ష్యం ఇదే
రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్ భరోసా కల్పించడం, కనీస మద్దతు ధర విధానం ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి అన్నారు. దీంతో తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వ్యవసాయం చేయగలరని మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!













Click it and Unblock the Notifications