Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!

కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రైతాంగానికి శుభవార్త చెప్పింది. తెలంగాణ రైతులు పండించిన పప్పుధాన్యాలు, నూనెగింజలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇక ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర రైతులకు గణనీయమైన లాభం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

పప్పుధాన్యాలు, నూనెగింజలను కొనుగోలు చేయనున్న కేంద్రం

దీంతో తెలంగాణలో రైతులు పండించిన ఒక లక్షా 25 వేల 855 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 894 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.

good news to farmers central govt approved the procurement of pulses and oilseeds with msp in telangana

రైతులకు మేలు చేసేలా కేంద్ర నిర్ణయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి మోదీకి, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతులకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

రైతులకు మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్న కేంద్రం

2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన పంటలను భారీ స్థాయిలో కొనుగోలు చేస్తోందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 70 వేల కోట్ల రూపాయల విలువైన పత్తిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేసిందని చెప్పారు.

రైతుల సంక్షేమమే కేంద్రానికి ప్రాధాన్యం

ఈ చర్యల వల్ల తెలంగాణ రైతులకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధర లభించేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, భవిష్యత్తులో కూడా రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే

రైతుల విషయంలో కేంద్ర లక్ష్యం ఇదే

రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్ భరోసా కల్పించడం, కనీస మద్దతు ధర విధానం ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి అన్నారు. దీంతో తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వ్యవసాయం చేయగలరని మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+