బేగంపేట వేదికగా వింగ్స్ ఇండియా 2026..నాలుగురోజుల ఎయిర్ షో, ప్రత్యేకతలివే!
ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమంగా పేరుగాంచిన 'వింగ్స్ ఇండియా 2026' కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 ఘనంగా జరగనుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.
ప్రపంచ విమానయాన రంగ భవిష్యత్తును ఆవిష్కరించేలా వింగ్స్ ఇండియా 2026
నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమం ప్రపంచ విమానయాన రంగ భవిష్యత్తును ఆవిష్కరించే వేదికగా నిలవనుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది.వింగ్స్ ఇండియా 2026ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 20కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు, పరిశ్రమ నేతలు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు.

ఒకే వేదికపై ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతులు, ఫ్యూచర్ ప్లాన్ లు
అంతర్జాతీయ స్థాయిలో విమానయాన రంగంలో జరుగుతున్న సాంకేతిక పురోగతులు, కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు.డిజైన్ నుండి విస్తరణ వరకు, తయారీ నుండి నిర్వహణ వరకు, చేరిక నుండి ఆవిష్కరణల వరకు, భద్రత నుండి స్థిరత్వం వరకు విమాన యాన రంగానికి చెందిన అన్ని విభాగాలలో నిపుణులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు.
సదస్సులు, సెమినార్ లతో వింగ్స్ ఇండియా 2026
ఈ ఎయిర్ షోలో ఆధునిక విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, ఏవియేషన్ టెక్నాలజీకి సంబంధించిన నూతన ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్లు ప్రదర్శించనున్నారు. అలాగే, పౌర విమానయాన రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని, గ్రీన్ ఏవియేషన్, సస్టైనబుల్ ఫ్యూయల్స్ వంటి అంశాలపై 13 ప్రత్యేక సెషన్లు, సదస్సులు నిర్వహించనున్నారు.
ఎయిర్ షో లో స్పెషల్ అట్రాక్షన్ ఇదే
భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశీయంగా విమానయాన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించడం, స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలుగా చెప్తున్నారు. ఈ ఎయిర్ షో లో భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం వైమానిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
భారత పౌర విమానయాన రంగం ప్రపంచస్థాయిలో బలోపేతం
వింగ్స్ ఇండియా 2026 ద్వారా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరగడంతో పాటు, భారత పౌర విమానయాన రంగం ప్రపంచస్థాయిలో మరింత బలోపేతం కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వింగ్స్ ఇండియాలో దేశంలోని వివిధ రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉంటుంది. విద్యార్థులు, మరి యువ నిపునులలో ఆవిష్కరణ, సమస్యల పరిష్కారం, పరిశ్రమ ఆధారిత ఆలోచనలను ప్రోత్సహించటం కోసంసివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కూడా నిర్వహిస్తారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications