పాతబస్తీలో దారుణం: యువకుడిపై కత్తులతో దాడి(వీడియో)
Recommended Video
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నూకర్ పార్లర్లో 27ఏళ్ల యువకుడు షబ్బీర్ హుస్సేన్పై కత్తులు, బేస్బాల్ స్టిక్లతో నలుగురు దుండగులు దాడి చేశారు.
ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ దుండగులు ఒకేసారి కత్తులతో దాడికి పాల్పడ్డారు. సినీఫక్కీలో జరిగిన ఈ దాడిలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడ్ని కాపాడేందుకు ఒకరు ప్రయత్నించగా అతనిపైనా దాడికి యత్నించారు దుండగులు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు.
#WATCH 3 men assaulted an employee of a snooker parlour in Hyderabad; reason unknown, police begin investigation,victim admitted to hospital pic.twitter.com/gdQuPHD5Cl
— ANI (@ANI) September 7, 2017
తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.