శవాలకు కూడా పరీక్షలు, చికిత్స: ప్రైవేట్ ఆస్పత్రులపై గవర్నర్ నిప్పులు
హైదరాబాద్: కార్పోరేట్, ప్రైవేట్ ఆస్పత్రులపై గవర్నర్ నరసింహన్ నిప్పులు చెరిగారు. చివరకు డెడ్ బాడీలకు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటైన 13వ అఖిల భారత క్యాన్సర్ కేర్ సదస్సులో ఆయన శనివారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు. ఫీజుల రూపంలో రోగులను ఆస్పత్రులు పట్టి పీడిస్తున్నాయని ఆగ్రహించారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు ఎందుకు వెళ్లరని ఆయన అడిగారు.

రోగులకు ప్రేమను కూడా పంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆయన అన్నారు. వైద్య రంగంలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. విధి నిర్వహణలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన అన్నారు.
షుగర్ టెస్టుకు వెళితే 28 టెస్టులు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ ఆస్పత్రులు వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆయన దుయ్యబట్టారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications