శవాలకు కూడా పరీక్షలు, చికిత్స: ప్రైవేట్ ఆస్పత్రులపై గవర్నర్ నిప్పులు
హైదరాబాద్: కార్పోరేట్, ప్రైవేట్ ఆస్పత్రులపై గవర్నర్ నరసింహన్ నిప్పులు చెరిగారు. చివరకు డెడ్ బాడీలకు ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటైన 13వ అఖిల భారత క్యాన్సర్ కేర్ సదస్సులో ఆయన శనివారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు. ఫీజుల రూపంలో రోగులను ఆస్పత్రులు పట్టి పీడిస్తున్నాయని ఆగ్రహించారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు ఎందుకు వెళ్లరని ఆయన అడిగారు.

రోగులకు ప్రేమను కూడా పంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆయన అన్నారు. వైద్య రంగంలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. విధి నిర్వహణలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన అన్నారు.
షుగర్ టెస్టుకు వెళితే 28 టెస్టులు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ ఆస్పత్రులు వైద్యం పేరుతో దోచుకుంటున్నాయని ఆయన దుయ్యబట్టారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications