టిడిపి పేచీపై హరీష్: మెట్రో రైలుపై కెసిఆర్ రివ్యూ
హైదరాబాద్: శాసనసభ ఆవరణలో గదుల కేటాయింపు పేచీపై తెలంగాణ శాసనసభ ావ్యవహారాల మంత్రి టి. హరీష్ రావు స్పందించారు. గదుల కేటాయింపుపై తెలుగుదేశం పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన మంగళవారంనాడు అన్నారు. తాము కేటాయించిన గదులు కాకుండా వేరేవి కావాలని తెలుగుదేశం పార్టీ పేచీ పెడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే శాసనసభలో గదుల కొరత ఉందని ఆయన చెప్పారు.
అసెంబ్లీలో తమకు కేటాయించిన గదిని మార్చాలని టిడిపి శాసనసభ్యులు మంత్రి హరీష్ రావును కోరారు. అయితే, అది సాధ్యం కాదని ఆయన చెప్పారు. దాంతో టిడిపి ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. గదులు మార్చాలంటే అడగాలి గానీ నిరసన తెలియజేయడం సరి కాదని హరీష్ రావు అన్నారు.

కాగా, హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మెట్రో రైలు అధికారులతో పాటు మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ కూడా పాల్గొన్నారు. పాతబస్టీలో మెట్రో రైలు అలైన్మెంట్ మార్పుపై ఈ సమావేశంలో చర్చించారు.
హైదరాబాదులోని మూడు చోట్ల మెట్రో రైలు మార్గాన్ని మార్చాలని కెసిఆర్ ఎల్ అండ్ టీకి సూచించిన విషయం తెలిసిందే. పాతబస్తీలో ఓ చోట కూడా దాని మార్గాన్ని మార్చడానికి కెసిఆర్ ప్రతిపాదన చేశారు. మెట్రో రైలు మార్గంలో ప్రార్థనా మందిరాలు, చారిత్ర కట్టడాలు ఉండడంతో వాటి పరిరక్షణకు అలైన్మెంట్ మార్చాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ సమీక్ష చేశారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications