TSఅలర్ట్: రాబోయే 48 గం. భారీ వర్షాలు -IMD వార్నింగ్ -Hyderabad లో 70 శాతం అధికంగా వర్షపాతం
తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైనా, కుంభవృష్టి ఆగేలా లేదు. రాష్ట్రంలో గడిచిన మూడు రోజులుగా వానలు దంచికొడుతుండగా, రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. విశ్వనగరం హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలతోపాటు రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
Recommended Video
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో బుధవారం తెల్లవారుజాము నుంచే వాన కురుస్తున్నది. ఉప్పల్, అల్వాల్, రాజేంద్రనగర్, కార్వాన్ ఏరియాల్లో ఉదయం 10 గంటల వరకు 0.5 మి.మీ. నుంచి 2 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది. బాచుపల్లిలో ఉదయం 10 గంటలకు భారీ వర్షం కురిసింది.

తెలంగాణలో చురుకుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఇప్పటివరకు అధిక వర్షాన్ని కురిపించాయని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) గణాంకాల్లో వెల్లడైంది. జూన్ 1 మరియు జూలై 20 మధ్య కాలంలో సాధారణ వర్షపాతం 273 మిమీ కాగా, ఈ ఏడాది 405.3 మిమీ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అధికంగా ఉన్నందున, ఒక్క జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులు లేవు. 33 జిల్లాల్లో 15 అధిక వర్షపాతం నమోదైందని (టీఎస్డీపీఎస్) పేర్కంది. ఇక
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదైందని, మంగళవారం నాటికే నగరంలో 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్ల తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. జులై 20వ తేదీ వరకు 359.5 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఈ తేదీ వరకు సాధారణ వర్షపాతం 210.9 మి.మీ. మాత్రమే. ఐఎండీ డాటా ప్రకారం.. జులైలో నెలలో 285.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, గత పదేళ్లలో ఇదే అత్యధికమని వెల్లడించింది. అటు
కోల్ బెల్ట్ ఏరియాలో వానలు దంచికొడుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం ఉదయం భారీ వర్షం కురుస్తుండటంతో ఓపెన్ కాస్ట గనుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మంచిర్యాల పరిధిలో కేకే, ఆర్కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దాదాపు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, పినపాకలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షంతో ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులకు ఆటంకం ఏర్పడింది. 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 28 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు అంతరాయం కలిగింది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, గుండాల, ఆలపెల్లిలో భారీ వర్షం కురిసింది. మణుగూరు ఉపరితల గనుల్లో ఓవర్ బర్డెన్ పనులకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ 4వ యూనిట్ సివిల్ వెల్డింగ్ పనులకు ఆటంకం కలిగింది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications