ఓటురు జాబితాలో తప్పులుంటే ఫిర్యాదు చేయండి: శశిధర్ రెడ్డికి హైకోర్టు
హైదరాబాద్: ఓటరు జాబితా సవరణ.. చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఓటరు జాబితా సవరణ వివరాలతో పాటు దానికి సంబంధించిన విధి విధానాలను ఈసీ శుక్రవారం హైకోర్టుకు సమర్పించింది.
సవరించిన జాబితా చట్టబద్ధంగా లేకపోతే తమకు ఫిర్యాదు చేయవచ్చనని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డికి హైకోర్టు సూచించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసింది. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలకు సంబంధించిన వ్యాజ్యంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది.

ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ ఇటీవల షెడ్యూలు సవరణ జరిగిందని.. కాబట్టి తెలంగాణలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరం లేదని ఈసీ వెల్లడించింది.
ఎన్నికల సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలపడం వెనక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని, ఈసీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని మర్రి శశిధర్ రెడ్డి తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. అయితే దీనిపై తదుపరి విచారణ దసరా సెలవుల తర్వాత చేపడతామని హైకోర్టు వెల్లడించింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications