పెదనాన్న నుండి ప్రత్యూష ఆస్తి వివరాలు ఆరా, పినతల్లి మొహం చూడనన్న జడ్జి
హైదరాబాద్: తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై, గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పందొమ్మిదేళ్ల యువతి ప్రత్యూష కేసు విచారణ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష ఆస్తుల వివరాలను ఆరా తీశారు.
ప్రత్యూష పెదనాన్న, పెద్దమ్మలను కోర్టు ఎదుట హాజరుపరిచారు. వారిద్దరని విచారించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష ఆస్తుల వివరాలను ఆరా తీశారు. ఈ నెల 20వ తేదీన ప్రత్యూష మేనమామను, తండ్రిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.
ప్రత్యూష ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తాను స్వయంగా ఆమెతో మాట్లాడుతానని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి.... తనకు ప్రత్యూష పినతల్లి మొహం చూడటం ఇష్టం లేదని చెప్పారు. ఆయన వ్యాఖ్యల్లో ఆయనలోని ఆవేదన కనిపిస్తోంది.
English summary
High Court division Bench Judges questions about Prathyusha's assets
Story first published: Friday, July 17, 2015, 12:15 [IST]