వాళ్లకెలా అప్పగిస్తారు?: డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండు పడకల ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపికపై తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే, ఆ జిల్లా మంత్రికి లబ్దిదారుల ఎంపిక చేసే బాధ్యతను 50:50 నిష్పత్తిలో అప్పగించడం అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటీషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.
అక్టోబర్ 15న గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన జివోను సవాల్ చేస్తూ జి.దేవదాస్ దాఖలు చేసిన పిల్పై విచారణ చేపట్టింది. లబ్దిదారుల ఎంపికను కమిటీకి అప్పగించకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా లబ్దిదారుల ఎంపిక చేస్తారని, అందుకు విధివిధానాలు ఏమిటని ప్రశ్నించింది.
ప్రభుత్వ ఉత్తర్వులు చట్టవిరుద్దంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చి తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.

పెద్దకుంట తండా వద్ద అండర్పాస్పై నివేదిక ఇవ్వండి
మహబూబ్నగర్ జిల్లా పెద్దకుంట తండా వద్ద తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అక్కడ ఉన్న అండర్పాస్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఎన్హెచ్ఐఏ, పోలీసు అధికారులను ఆదేశించింది.
ఆసిమ్ అవతార్దాస్, మరో ఇద్దరు దాఖలు చేసిన పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications