గణేశ్ విగ్రహాల ఎత్తు 15ఫీట్లకు మించొద్దు: నివేదిక కోరిన హైకోర్టు
హైదరాబాద్: నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించే గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు సోమవారం మరోసారి స్పందించింది. హుస్సేన్ సాగర్లో గణేశ్ నిమజ్జనం చేయరాదన్న వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఉత్సవాల ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు చేపట్టారో తమకు తెలపాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది.
విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీకి సూచించింది. గణేష్ ఉత్సవ సమితి విగ్రహాల ఎత్తు విషయంలో హైకోర్టు సూచనలను వ్యతిరేకించిన నేపథ్యంలో హైకోర్టు మరోసారి ఘాటుగా సూచనలు చేసింది.

కాలుష్యం, విగ్రహాల తయారీకి వాడే రంగు లాంటి పలు అంశాలపై గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు మరోసారి గుర్తు చేసింది. తామిచ్చిన సూచనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్రలో మాదిరిగా తాత్కాలిక డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చెరువుల ఆక్రమణలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడి వాటికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 31లోగా చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని సూచించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తమను సంప్రందించాలని హైకోర్టు సూచించింది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications