కేసీఆర్ను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటన, కొడంగల్లో ఉద్రిక్తత, 144 సెక్షన్
కొడంగల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోస్గీ పర్యటనను అడ్డుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు (డిసెంబర్ 4, మంగళవారం) కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆయన బహిరంగ సభ ఉంది.
దీనిని అడ్డుకునేందుకు రేవంత్ సమాయత్తమవుతున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొని ఉంది. కేసీఆర్ రాక నేపథ్యంలో రేపు బందుకు పిలుపునిచ్చి, ఉపసంహరించుకున్నారు రేవంత్ రెడ్డి. నిరసనలకు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులను మోహరించారు. 144 సెక్షన్ అమలు చేశారు. మండలస్థాయిలో ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. అవసరమైతే రేవంత్ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశముంది.
Comments
revanth reddy kcr patnam narender reddy kodangal hyderabad praja front telangana congress mahakutami trs bjp telangana elections 2018 telangana assembly elections 2018 five state assembly elections 2018 అసెంబ్లీ ఎన్నికలు 2018
English summary
High tension continues in kodangal, Revanth Reddy calls for protests. Telanana Caretaker CM KCR will come to Kodangal on December 4.
Story first published: Monday, December 3, 2018, 21:20 [IST]