కేటీఆర్ ను రీప్లేస్ చేసే దమ్మున్న ఐటీ మంత్రి ఎవరు?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపడుతోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగగా, ఎట్టకేలకు రేవంత్ రెడ్డినే సీఎంగా నిర్ణయించినట్టు తేలింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర పురోగతిలో కీలకంగా భావించే ఐటీ శాఖ ని ఎవరికి ఇవ్వబోతున్నారు? అన్న చర్చ కూడా జరుగుతుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా పనిచేసిన ఐటీ శాఖలో ఆయనను రీప్లేస్ చేయగలిగిన దమ్మున్న నాయకుడు ఎవరు? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తరింప చేయడానికి చాలా కృషి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలలో కేటీఆర్ హయాంలో ఐటీ విస్తరణ జరిగింది.

రాష్ట్రంలోకి అనేక సంస్థలను కూడా ఆహ్వానించి, వారికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన చేసి ఐటీ రంగానికి ఆయన పెద్దపీట వేశారు. ఇక కేటీఆర్ ఐటి పైన ఫోకస్ పెట్టి పనిచేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఐటీ శాఖను ముందుకు తీసుకు వెళ్లిన కేటీఆర్ ను మర్చిపోయేలా చేసే మంత్రి ఎవరు అన్నది జోరుగా చర్చ జరుగుతుంది.
అయితే కేటీఆర్ పనితీరుకు ఫిదా అయినా చాలామంది కచ్చితంగా కేటీఆర్ ను మిస్ అవుతామని తెగ బాధ పడుతున్నారట. ఫ్రెండ్లీ మినిస్టర్ గా అందరితోను బాగా మాట్లాడే కేటీఆర్, సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో ప్రజలకు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. ఇక అలాంటి కేటీఆర్ ను తాము మిస్ అవుతున్నామని బాధపడుతున్నారు పలువురు కేటీఆర్ ఫ్యాన్స్.
అయితే ఇదే సమయంలో ఎవరికి ఐటీ శాఖ కేటాయిస్తారని చర్చ జరుగుతున్న వేళ గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అంతేకాదు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications