Medaram: మేడారంకు ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఫ్రీ ఉందా.. ఛార్జీలు ఎంతంటే..!
లక్షలాది మంది భక్తులు మేడారం జాతర కోసం చూస్తున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క-సారక్క ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు భారీగా భక్తులు తరలొస్తారు. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తాగునీరు, ఇతర ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ జాతరకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే ఈ ప్రత్యేక బస్సుల ఛార్జీలు ఉంటాయా.. కామన్ ఛార్జీలు ఉంటాయా అని సందేహాలు తలెత్తాయి.
అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఉంటుందా అని డౌట్లు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి మేడారం జాతరకు 35 లక్షల మందిని తీసుకెళ్లాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జాతర జరిగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు లక్షలాది మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోని 9 రీజియన్ల పరిధిలోని బస్సులను నడపనున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర నుంచి మొత్తం 51 పాయింట్ల ద్వారా ఈనెల 18 నుంచి పెంచిన ప్రత్యేక బస్సులు నడుతోన్నట్లు ఆర్టీసీ వివరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూజు పాయింట్ల ద్వారా 2,650 బస్సులు నడపనున్నారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఇందులోని 2200 బస్సులను మేడారం జాతరకు వినియోగించనున్నట్లు అధికారులు చెప్పారు.
ఈసారి జాతరకు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. డీజిల్ ధరలు పెరగడంతో టిక్కెట్ రేట్లను కొంతవరకు పెంచాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. గతంలో ఎక్స్ప్రెస్ బస్సుల్లో వరంగల్ నుంచి మేడారానికి ఒక్కొక్కరికి రూ.190 ఉంది. దాన్ని ఇప్పుడు రూ.60 పెంచి రూ.250కి చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరికి ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.440 ఉంది. దాన్ని రూ.550 చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications