ప్రైవేట్ ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తా... భార్యకు భర్త బెదిరింపులు...
ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళకు పెళ్లయిన కొన్నాళ్లకే అత్తమామల నుంచి అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. దానికి తోడు పిల్లలు కావట్లేదని భర్త నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అటు అత్తమామలు,ఇటు భర్త వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్కి చెందిన ఓ మహిళ(24)కు 2016లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నప్పుడు మహమ్మద్ ఫర్హాన్(26) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కోర్సు పూర్తయ్యాక ప్రేమ విషయాన్ని ఇద్దరు తమ పెద్దవాళ్లకు చెప్పారు. ఇరువురు అంగీకరించడంతో 2017లో వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మహిళ తండ్రి దాదాపు రూ.1కోటిన్నర విలువైన బంగారు,వజ్రాభరణాలు కట్నంగా ఇచ్చారు.మరో రూ.1కోటిన్నర ఖర్చు చేసి పెళ్లి ఘనంగా నిర్వహించాడు.

పెళ్లి తర్వాత ఆ నగలన్నింటినీ భద్రతా పరుస్తానని చెప్పి ఆమె అత్త అయేషా ఒస్మాన్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు అడిగినా నగలు ఇచ్చేవారు కాదు. శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పెట్టుకుంటానని చెప్పినా ఎప్పుడూ ఇవ్వలేదు. ఇదే క్రమంలో అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టారు. మరోవైపు పెళ్లయినా నాలుగేళ్లయినా పిల్లలు లేరంటూ భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమె ప్రైవేట్ ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని అతను బెదిరించడం మొదలుపెట్టాడు.దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మెట్పల్లిలో వివాహిత ఆత్మహత్య :
అత్తింటి వేధింపులకు తాళలేక మెట్పల్లిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్పల్లి సాయిరాం కాలనీకి చెందిన రమ్య(20)కు అదే కాలనీకి చెందిన దొమ్మాటి నరేందర్తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. కొంతకాలం కాపురం సాఫీగానే సాగినప్పటికీ... ఆ తర్వాత నరేందర్, అతని తల్లి జమునలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు.
దీంతో జీవితంపై విరక్తి చెందిన రమ్య... గత నెల 31న ఇంట్లో ఎలుకల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గురువారం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
గరుడ పురాణం ప్రకారం "భార్య" ఎన్ని రకాలు ఉంటారో తెలుసా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications