అక్కడ టీఆర్ఎస్కు కష్టమేనా.. ఈ లెక్కలు ఆ పార్టీకి అనుకూలమా?
నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఆ పార్టీల అభ్యర్థులకు తోడుగా క్యాడర్, లీడర్లంతా అక్కడే మకాం వేశారు. గెలుపు మాదంటే మాదంటూ ప్రతి సవాళ్లు విసురుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హుజుర్నగర్ బరి ఏం చెబుతోంది. పాత చరిత్ర ఏమంటోంది. ఆ లెక్కలు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతాయి. ఇంతకు గెలుపెవరిది మరి. ఇలాంటి కాలిక్యులేషన్లు రాష్ట్రమంతటా చర్చానీయాంశంగా మారాయి.

ఉత్తమ్ రాజీనామాతో ఉప ఎన్నిక
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ పోరులో నల్గొండ ఎంపీగా బరిలోకి దిగి మళ్లీ విజయం సాధించారు. అయితే ఎంపీగా కొనసాగడానికి సిద్ధమైన ఉత్తమ్.. హుజుర్నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ క్రమంలో ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో నిలిచారు.

స్వతంత్ర అభ్యర్థులతో ముప్పేనా..?
హుజుర్నగర్ అసెంబ్లీ స్థానంలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. పురుషులు, మహిళల ఓట్లు చెరో లక్షకు పైగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ కనిపిస్తున్నా.. ఇండిపెండెంట్లతో ఆ రెండు పార్టీలకు ముప్పు పొంచి ఉందనే వాదనలు లేకపోలేదు. గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు పోటీ చేసి దాదాపు 10 వేల ఓట్లు సాధించారు. అందులో ఒక్క అభ్యర్థికే 5 వేల ఓట్లు పడటం విశేషం.

ఎవరు గెలిచినా మెజార్టీ కష్టమేనా?
ఈసారి కూడా హుజుర్నగర్లో ఇండిపెండెంట్ల హవా కనిపిస్తోంది. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఎన్నికల బరిలోకి దిగారు. ప్రచారంలో కూడా ఏమాత్రం తగ్గకుండా దూసుకెళుతున్నారు. మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీకి సై అనడంతో హుజుర్నగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. దాంతో ఈసారి కూడా ఇండిపెండెంట్ల బాధ తప్పేలా లేదు. గెలుపోటములు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ఎవరు గెలిచినా దాదాపు తక్కువ మెజార్టీతో బయటపడతారనే టాక్ వినిపిస్తోంది.

గత ఎన్నికల్లో మెజార్టీ 7 వేలు.. ఈసారి తక్కువేనా?
ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించినా.. కేవలం వేయి, రెండు వేల ఓట్ల తేడాతో బయటపడే ఛాన్స్ కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగానీ వేలకు వేల ఓట్లు సాధించి బంపర్ మెజార్టీ అంటూ ఏమి ఉండకపోవచ్చనేది కొందరి మాట. ఈ లెక్కన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 92 వేల 996 ఓట్లు పోలయ్యాయి. అదే టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 85 వేల 530 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 7 వేల 466 ఓట్ల మెజార్టీతో ఉత్తమ్ గెలుపొందారు. ఇక్కడ గణాంకాలు సరి చూస్తే ఇండిపెండెంట్లు అందరూ కలిసి దాదాపు 10 వేల ఓట్లు సాధించారు. అంటే ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు బరిలో లేకుంటే ఆ ఓట్లు కారు గుర్తుకు కలిసొచ్చి టీఆర్ఎస్ గెలిచి ఉండేదనే టాక్ వినిపించింది.

కాంగ్రెస్ పార్టీ కంచుకోట.. కారు దూసుకెళ్లేనా..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటికీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లో కోదాడ నుంచి విజయం సాధించారు. అనంతరం 2009, 2014లో హుజుర్నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచినప్పటికీ అటు నల్గొండ ఎంపీగా విజయం సాధించడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. ఈ లెక్కన ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినట్లైంది. అయితే హుజుర్నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే లెక్క కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంచనాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications