Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుజుర్‌నగర్ ఎన్నిక రెఫరెండం కాదు... కాంగ్రెస్

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రెఫరెండం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటి చేసినప్పుడే రెఫరెండంగా స్వీకరించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీటుపై అని చెప్పారు. మరోవైపు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు.

హుజుర్‌‌నగర్ ఉప ఎన్నికపై హాట్‌హాట్‌గా ప్రచారం కొనసాగుతోంది. నువ్వా నేనా అనే చందంగా అధికార టీఆర్ఎస్,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల సభ్యులు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీస్తోంది. ఉప ఎన్నికలను రిఫరెండంగా భావించాలని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే రెఫరెండంపై కాంగ్రెస్ పార్టీలో మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

Huzurnagar by elections will not be referendum : Damodara rajanarsimha

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం ఆ పార్టీలో అంతర్గతకుమ్ములాటలు కొనసాగుతున్న నేపథ్యంలోనే భవిష్యత్ నాయకుడిపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటీ సంధర్భంలో ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలేత్తే అవకాశాలు ఉన్నట్టు నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పన్నేండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ భవిష్యత్ మసకభారింది.

ఓవైపు అధికార టీఆర్ఎస్ హుజుర్‌నగర్ స్థానానికి కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపింది.ఇలాంటీ సంధర్భంలో రెఫరెండంగా బావించడం పార్టీకి చేటుతెస్తుందని కొంతమంది నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+