Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నైటీలో వచ్చి మొబైల్ షోరూంలో భారీ దొంగతనం: ఆ ఒక్క పొరపాటుతో దొరికిపోయాడు

హైదరాబాద్: సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి దొంగబుద్ధి పుట్టింది. మొబైల్ షోరూంలో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి షోరూం తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్లు దొంగిలించాడు. అంతా ప్లాన్ ప్రకారమే చేసినా.. అతుడు చేసిన చిన్న పొరపాటుతో చివరకు పోలీసులకు చిక్కాడు. సికింద్రాబాద్ మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండిపల్లెకు చెందిన మంకాల యాకయ్య అలియాస్ వినయ్(28) తండ్రి చనిపోవడంతో ఉపాధి కోసం తల్లి, సోదరితో కలిసి ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. కంటోన్మెంట్ తాడ్‌బండ్, బాపూజీనగర్‌లో నివాసముంటూ సికింద్రాబాద్ ఎస్‌డీ రోడ్డులోని ఎమరాల్డ్ హౌస్‌లో నైట్ సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం సోదరి ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు.

 Hyderabad: accused arrested for cell phones theft in mobile showroom

కాగా, గతంలో యాకయ్య రియల్ మీ మొబైల్ షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎమరాల్డ్ హౌస్ మొదటి అంతస్తులో కూడా రియల్ మీ షోరూం ఉంది. అందులో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకుని..పక్కా ప్లాన్‌తో మే 28న రాత్రి 12.30 గంటలకు అతని సోదరి నైటీని ధరించి షోరూం వద్దకు వెళ్లాడు. షోరూంకి మరోవైపు మూసివేసి ఉన్న షెట్టర్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ట్యాబ్‌తో పాటు 27 మొబైల్ ఫోన్లను చోరీ చేసి సొంతూరుకు వెళ్లాడు.

అయితే, మే 29న ఉదయం మొబైల్ షోరూంలో చోరీ జరిగినట్లు స్టోర్ ఇంఛార్జీ మహ్మద్ యూసుఫ్ మహంకాళీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. దీంతో నైటీలో ఉన్న ఒక మహిళ వచ్చినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులను విచారించారు. ఇందులో భాగంగా యాకయ్యపై అనుమాని వచ్చి ఆ దిశగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితుడిని మడిపల్లెలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నేరం అంగీకరించాడు.

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి రూ. 8.28 లక్షల విలువైన 37 రియల్ మీ ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం రిమాండ్ కు తరలించారు. నిందితుడు పక్కా ప్లాన్‌తో దొంగతనం చేసినప్పటికీ.. సెలవు పెట్టి ఊరేళ్లడంతో అతనిపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో దర్యాప్తు జరపడంతో అతని వ్యవహారం బయటపడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+