పాక్ యువతిని ప్రేమించిన హైదరాబాదీ: నేపాల్ నుంచి బీహార్ వచ్చి ఆమె అరెస్ట్
హైదరాబాద్: దాయాది దేశం పాకిస్థాన్కు చెందిన యువతిని ప్రేమించాడు హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఆమెను భారతదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్రమంగా పాక్ యువతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో బీహార్ పోలీసులు యువతిని, ఆమె ప్రియుడి సోదరుడు మహమూద్ను అరెస్ట్ చేశారు.
హైదరాబాదీకి సోషల్ మీడియాలో పాక్ యువతి పరిచయం
అయితే,
హైదరాబాద్
పోలీసులు
మహమూద్
వివరాలను
సేకరిస్తున్నారు.
బీహార్
పోలీసులను
సంప్రదించడంతోపాటు
ఇంటెలిజెన్స్
బ్యూరో
అధికారులతోనూ
వివరాలు
అడిగి
తెలుసుకుంటున్నారు.
బహదూర్పుర
పోలీస్
స్టేషన్
పరిధిలో
ఉండే
అహ్మద్..
సౌదీలో
ఉద్యగోం
చేస్తున్నాడు.
సోషల్
మీడియా
ద్వారా
పాకిస్థాన్లోని
ఫైసలాబాద్
చెందిన
ఖాదియా
నూర్
తో
పరిచయం
ఏర్పడింది.
పాక్ యువతిని పెళ్లాడదామనుకున్న హైదరాబాదీ
ఆ మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న అహ్మద్.. ఆమెను హైదరాబాద్ తీసుకురావాలనుకున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న తన సోదరుడు మహమూద్కు తెలిపాడు. దీంతో పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీని కోసం అహ్మద్ తోపాటు సౌదీలో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి జీవన్ సాయం చేస్తానన్నాడు.
హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో అరెస్టైన ప్రియురాలు, సోదరుడు
ఖాదియా నూర్ పాకిస్థాన్ నుంచి నేపాల్ చేరుకుని జీవన్ను కలిసింది. అతడు ఖాదియాను బీహార్ సరిహద్దుకు తీసుకొచ్చాడు. అయితే, సరిహద్దు బీఎస్ఎఫ్ పోలీసులు తనిఖీ చేయగా.. ఆమె వద్ద నకిలీ ఆధార్ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా.. పాకిస్థాన్ యువతిగా తెలిపింది. అహ్మద్ సోదరుడు మహమూద్ సూచన మేరకు తాను ఖాదియాను తీసుకొచ్చినట్లు జీవన్ పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ఖాదియా నూర్, జీవన్, మహమూద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అహ్మద్ కు ఖాదియాతో ఎప్పట్నుంచి పరిచయం ఉందనే వివరాలను హైదరాబాద్ పోలీసులు సేకరిస్తున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.