పెద్దలు కుదిర్చినా సరే... పెళ్లి ముసుగులో పొంచిఉన్న ప్రమాదం.. సజ్జనార్ హెచ్చరిక
పెళ్లి ముసుగులో ప్రమాదం పొంచి ఉందని హైదరాబాద్ లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాదులో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఇలా
ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్ కి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు. మోసం జరుగుతున్న తీరును వివరించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ముందుగా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చూపులు చూస్తారని, ఆపై ఎంగేజ్మెంట్ జరిపించుకుని పెళ్లి ఖాయమైంది కదా అనే చదువుతో యువతులకు దగ్గర అవుతున్నారని పేర్కొన్నారు.

పెళ్లి పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్
యువతులకు మాయమాటలు చెప్పి, త్వరలోనే పెళ్లి చేసుకుంటాం కదా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా లోబరుచుకుంటున్నారని, తీరా తమ కోరిక తీరిన తర్వాత అసలు రంగు బయట పెడుతున్నారని ఆయన అన్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆమ్మాయిలకు, తల్లిదండ్రులకు సీపీ హెచ్చరిక
నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడం, తీరా పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారన్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కేటుగాళ్లు అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని పరువు పోతుందని భావించి భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని సీపీ హెచ్చరిస్తున్నారు.
పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే
నిశ్చితార్థం అయినా సరే పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని cp సూచిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధం కదా అని గుడ్డిగా నమ్మొద్దని, అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్ల పైన ఆరా తీసి పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని పేర్కొన్నారు. శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ధైర్యంగా తిరస్కరించాలని చెప్పారు.
వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్న సీపీ
భయపడకుండా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎటువంటి భయం లేకుండా ముందుకు రావాలని ఆయన వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. ఇక అమ్మాయిలకు ఇటువంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9 4 9 0 6 1 6 555 కు గాని, డయల్ 100 కి కానీ కాల్ చేయాలని సూచించారు.
-
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా మంత్రి.. పరిస్థితి ఇలా! -
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పవర్ వినియోగంపై డిప్యూటీ సీఎం పవర్ఫుల్ కామెంట్స్! -
కరీంనగర్ సీపీపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! -
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ.. కీలక భేటీ ! -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం - అనూహ్య నిర్ణయం..!! -
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, వారికి కేటాయింపు - పంపిణీ ముహూర్తం..!! -
దుబాయ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా మంత్రి.. పరిస్థితి ఇలా! -
T20 World Cup 2026: పాక్ ఆటగాళ్లకు పీసీబీ భారీ జరిమానా! -
పాకిస్థాన్పై డ్రోన్ దాడి.. ఎయిర్బేస్ లక్ష్యంగా భీకర దాడులు! -
నాడు సంజూ పై సూర్య వెటకారం, ఇప్పుడు టోపీ తీసి సెల్యూట్..!!













Click it and Unblock the Notifications