లేడీని 4సార్లు రప్పించుకొని, ఫోటో తీసి బ్లాక్మెయిల్
హైదరాబాద్: తాను దేవుడి ప్రతినిధిని అంటూ ఓ వివాహితను బెదిరించిన 25 ఏళ్ల నకిలీ బాబాను సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుండి ఒక మొబైల్ ఫోన్ను, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ (నేరాలు) పాలరాజు మంగళవారం మాట్లాడుతూ నిందితుడిని రిమాండుకు తరలించినట్లు చెప్పారు.
తమిళనాడులోని వెల్లూరుకు చెదిన షౌకత్ హుస్సేనే హైదరాబాద్ వచ్చి మత ప్రచారం చేస్తూ.. తాను దేవుడికి ప్రతినిధిని అని చెప్పుకునే వాడు. టోలీచౌకీలో ఉంటున్న ఓ మహిళ తన వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూ షౌకత్ వద్దకు వెళ్లింది.

తాను తమిళనాడు నుండి పవిత్రమైన మందును తీసుకు వచ్చానని ఆమెతో చెప్పాడు. తాను చెప్పిన ప్రాంతానికి ఒంటరిగా రావాలి కోరాడు. దీంతో ఆమె అక్కడకు వెళ్లింది. ఉపదేశం పేరుతో ఆమె నుదుటి పైన పసరు పూసి ఫోటోలు తీశాడు. మరో మూడుసార్లు వేర్వేరు ప్రాంతాలకు పిలిపించి అలానే చేశాడు.
కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేసి లక్ష రూపాయల డబ్బు కావాలని అడిగాడు. లేదంటే తాను తీసిన ఫోటోలను భర్తకు పంపిస్తానని, అలాగే తాము పలుమార్లు కలుసుకున్న విషయాన్ని చెబుతానని బెదిరించాడు. దీంతో బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు ఆమెతో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడు.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications