సన్ బర్న్ ఫెస్ట్లో తుపాకీ కలకలం, మైనర్లకు నో ఎంట్రీ
గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం సన్ బర్న్ ఫెస్టివెల్ నిర్వహించారు. ఈ ఫెస్ట్కు ఒకరు తుపాతో హాజరు అయ్యేందుకు ప్రయత్నించారు. తనిఖీలలో తుపాకీనీ గుర్తించారు. అతనిని బయటకు పంపించారు.
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం సన్ బర్న్ ఫెస్టివెల్ నిర్వహించారు. ఈ ఫెస్ట్కు ఒకరు తుపాతో హాజరు అయ్యేందుకు ప్రయత్నించారు. తనిఖీలలో తుపాకీనీ గుర్తించారు. అతనిని బయటకు పంపించారు.
గచ్చిబౌలిలో నిర్వహించిన సన్ బర్న్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 12 వేల మంది వరకు టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే చిన్నపిల్లలను పబ్బులోకి ఆహ్వానించొద్దని, సన్ బర్న్ కార్యక్రమాన్ని వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది.

దీంతో మైనర్లను ఈ పార్టీకి అనుమతించలేదు. దీంతో తమకు ముందు టిక్కెట్లు ఎలా అమ్మారని పలువురు ప్రశ్నించారు. మరోవైపు సన్ బర్న్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామన కాంగ్రెస్ చెప్పడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications