బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్:ఎల్ఐసీ డబ్బులు క్లైయిమ్, పోలీసులకు చిక్కాడిలా..
హైదరాబాద్:భీమా సొమ్మును బతికుండగానే తప్పుడు సర్టిఫికెట్లతో క్లైయిమ్ చేసుకొన్న నిందితులను హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు హైద్రాబాద్లో అరెస్ట్ చేశారు.ఇప్పటికే ఒక దఫా భీమా సొమ్మును క్లైయిమ్ చేసుకొన్న ఘటన చోటు చేసుకొంది. మరో దఫా భీమా సొమ్మును మరోసారి క్లైయిమ్ చేసుకొనేందుకు ధరఖాస్తు చేసుకోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన అరిపిరాల రవిశంకర్ శర్మ ఈ కుట్రకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేసినట్టు తూర్పు మండల డీసీపీ శశిధర్ రాజు చెప్పారు
ఈ కేసుకు సంబంధించిన వివరాలను తూర్పు డిసీపీ శశిధర్ రాజు బుధవారం నాడు మీడియాకు వివరించారు.భీమా సొమ్మును క్లైయిమ్ చేసుకొనేందుకు ప్రభుత్వాధికారులను కూడ ఉపయోగించుకొన్నారని పోలీసులు తెలిపారు.

బతికుండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు
ప్రకాశం జిల్లా అరిపిరాల రవిశంకర్ శర్మ ప్రకాశం జిల్లాలో ఎల్ఐసీలో బీమా చేయించుకొన్నాడు. ఈ పాలసీని హైదరాబాద్ పుత్లీబౌలి బ్రాంచ్కు బదిలీ చేయించుకున్నాడు. ఇదే మాదిరిగా మరో మూడు పాలసీలు చేయించుకున్నాడని చెప్పారు.అయితే, సొమ్ము కోసం తాను చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి బీమా సొమ్మును కాజేశాడు. మరోసారి తాను చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాన్ని తయారు చేయించుకుని అతని భార్య ఉషశ్రీ ద్వారా బీమా సొమ్మును డ్రా చేశారని తూర్పు డీసీపీ శశిధర్ రాజు చెప్పారు.

తప్పుడు పత్రాలతో మరోసారి ధరఖాస్తు
తొలిసారి రవిశంకర్ శర్మ ఎల్ఐసీ భీమా డబ్బులను క్లైయిమ్ చేసుకొన్నాడు. అయితే మరోసారి భీమా డబ్బుల కోసం క్లైయిమ్ చేశారు.ఒకే మరణ ధ్రువపత్రం వేర్వేరు సమయాల్లో లబ్ధి పొందడానికి ఉపయోగించుకోవడంతో అనుమానం వచ్చిన ఎల్ఐసీ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపారు. ఒకే వ్యక్తి పేరుతో మరోసారి ధరఖాస్తు రావడంతో విచారణ జరిపితే క్లైయిమ్లు విచారణ జరపడంతో రవిశంకర్ శర్మ భాగోతం వెలుగు చూసింది.

బతికే ఉన్నాడని గుర్తించిన ఎల్ఐసీ అధికారులు
ఒకే ధరఖాస్తు రెండు దఫాలు రావడంతో విచారణ చేసిన ఎల్ఐసీ అధికారులకు ఒక విషయం వెలుగు చూసింది. రవిశంకర్ శర్మ బతికే ఉన్నాడని గుర్తించారు. రవిశంకర్ శర్మ బతికే ఉన్నాడని గుర్తించిన విషయం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.డబ్బుల కోసం కావాలనే చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి మోసం చేశాడని గుర్తించి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

నిందితులను అరెస్ట్
ఎల్ఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు రవిశంకర్ శర్మ, అతని భార్య ఉషశ్రీ, నకిలీ ధ్రువపత్రాల జారీకి సహకరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాజా ఆరీఫుద్దీన్తో పాటు మరొకరు ముజీబుల్లాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల విచారణలో భీమా డబ్బులను క్లైయిమ్ చేసిన విషయాన్ని నిందితులు ఒప్పుకొన్నారు.వారి నుంచి రూ.65వేలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండలం డీసీపీ శశిధర్రాజు తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications