Weather Report: ఆ జిల్లాల్లో వడగళ్ల వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. సిద్దిపేట జిల్లా, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ద్రోణి కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపింది. వడగండ్ల వానకు సైతం ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో 34 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండదని సూచించింది.

శుక్రవారం సాయంత్రం, రాత్రి తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోన పలు గ్రామాల్లో వర్షం కురిసింది.
పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications