హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో పైన శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. మార్చి నెల 15వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఎల్ అండ్ టి మెట్రో వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు 76 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టి, శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా దూరం చేసేలా మెట్రో
శాసనమండలిలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. హైదరాబాద్లోని ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు మెట్రో రైలును మరో 76 కిలోమీటర్లు విస్తరించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో, ప్రభుత్వమే 15 వేల కోట్లతో మెట్రోను స్వాధీనం చేసుకుందని తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో దేశంలో 12వ స్థానానికి
అలాగే, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. గత పదేళ్ల నిర్లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో దేశంలో 12వ స్థానానికి పడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దివంగత జయపాల్ రెడ్డి కృషితోనే మెట్రో రైలు ప్రాజెక్టు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మాది గుడ్ గవర్నెన్స్ కాదు స్మార్ట్ గవర్నెన్స్ అని పేర్కొన్నారు.
33 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ
సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు అంటూ హితవు పలికారు. అభివృద్ధిని కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయలేదన్నారు. 33 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలిస్తామని పేర్కొన్నారు.
మూసీ సుందరీకరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మారుస్తామని భరోసా
రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు ఎన్నికలప్పుడే అభివృద్ధి విషయంలో అందరూ ఒక్కటి కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. మూసీ సుందరీకరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మారుస్తామని భరోసా ఇచ్చారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు! -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
తెలంగాణాలో ఆ గ్రామానికి గ్యాస్ చింతే లేదు.. ఎందుకంటే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు











Click it and Unblock the Notifications