అద్దెకోసం వచ్చి దొంగతనాలకు పాల్పడే జంట
పెళ్ళై భార్య ఉండగానే చనువుగా ఉన్న మరో మహిళను పెళ్ళిచేసుకొన్నాడు. అంతే కాదు డబ్బుల సంపాదన కోసం ఉదయం పూట దొంగతనాలు చేస్తున్నారు.యధేచ్చగా చోరీలకు పాల్పడి వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తున్నారు.
హైదరాబాద్:పెళ్ళై భార్య ఉండగానే చనువుగా ఉన్న మరో మహిళను పెళ్ళిచేసుకొన్నాడు. అంతే కాదు డబ్బుల సంపాదన కోసం ఉదయం పూట దొంగతనాలు చేస్తున్నారు.యధేచ్చగా చోరీలకు పాల్పడి వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తున్నారు.
అంబర్ పేట శంకర్ నగర్ కు చెందిన ఒగ్గు శ్రీనివాస్. గతంలో ఓ కంపెనీలో పనిచేసేవాడు. అతనికి నెలవారీ జీతం రూ.7 వేలు.అయితే అక్కడే పరిచయమైన రేణుకను ఆయన రెండో వివాహం చేసుకొన్నాడు.

ఆమె కూడ ఓ ఇంట్లో పనిచేసేది. ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన సరిగా లేదని ఉద్యోగం నుండి తొలగించారు. అయితే వారిద్దరికి పూట గడవడం కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకుగాను దొంగతనాలు చేయాలని ఎంచుకొన్నారు ఆ దంపతులు.
సులువుగా డబ్బులను సంపాదించే మార్గంతో పాటుగా ఈ డబ్బుతో జల్సాలు చేసేవారు ఆ దంపతులు.ఉదయంపూట చక్కగా తయారై స్కూటీపై బయలుదేరేవారు. టూలెట్ అనే బోర్డులు ఉన్న ఇంటి వద్ద ఆగేవారు.
ఇంటికోసం వెతుకుతున్నామంటూ అక్కడి వాచ్ మెన్ , యజమానులను నమ్మించేవాడు. ఇల్లు, ప్లాట్స్ ను పరిశీలించే ఉద్దేశ్యంతో లోపలకు చేరేవాడు. ఆ సమయంలో చుట్టుపక్కల తాళం వేసిన ఇళ్ళను గమనించేవాడు.
అక్కడి పరిస్థితులను అంచనావేసేందుకు రెక్కీ నిర్వహించేవాడు. అదునుచూసీ ఇంటితాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. అక్కడ దొరికిన విలువైన వస్తువులు, నగదుతో అదే స్కూటీపై నెమ్మదిగా జారుకొనేవారు.
ఇల్లు అద్దెకు కావాలంటూ సుమారు 100 ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వందకుపైగా సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. చివరకు ఒక ఆధారంతో తీగలాగితే అంబర్ పేటలో దొరికారు. వారిద్దరిని ఆదివారం నాడు అరెస్టు చేశారు పోలీసులు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications