మ్యారేజ్ బ్యూరోతో మాయలేడి వల, పెళ్ళికాని ప్రసాద్లే టార్గెట్
పెళ్ళికాని ప్రసాద్ లను లక్ష్యంగా చేసుకొని మ్యారేజ్ బ్యూరో పేరుతో ఓ మాయలేడీ యువకులను మోసం చేస్తోంది. అయితే పోలీసులు యువతి బాగోతాన్ని బయటపెట్టారు.మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకొన
హైదరాబాద్: పెళ్ళికాని ప్రసాద్ లను లక్ష్యంగా చేసుకొని మ్యారేజ్ బ్యూరో పేరుతో ఓ మాయలేడీ యువకులను మోసం చేస్తోంది. అయితే పోలీసులు యువతి బాగోతాన్ని బయటపెట్టారు.మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.
హైద్రాబాద్ కాప్రాకు చెందిన శ్రీదేవి అనే యువతి శ్రీరామ్ నగర్ కాలనీలో సాయి శ్రీవాణి పేరుతో కొంతకాలంగా బ్యారేజ్ బ్యూరోను నిర్వహిస్తోంది.అందమైన వరుడు, వధువులను చూపిస్తామంటూ ఆమె పత్రికల్లో ప్రకటనలను ఇచ్చేది.ఈ ప్రకటనల ఆధారంగా మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించే యువకులను మోసం చేసేది.
మహ్మద్ నజీ అనే వ్యక్తి శ్రీదేవికి ఫోన్ చేశాడు. ఆమె తన మాటలతో అతడిని బురిడీ కొట్టించింది.దీంతో అతడు ఆమె ఖాతాలో రూ.9 వేలను జమచేశాడు. డబ్బులు ఆమె ఖాతాలో జమ కాగానే ఆమెకు ఫోన్ చేయగానే అతడికి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
అయితే తాను మోసపోయానని బావించిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సిసిఎస్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదుచేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆదారంగా పోలీసులు శ్రీదేవిని సోమవారం నాడు అరెస్టు చేశారు. మ్యారేజ్ బ్యూరో కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.