సెలూన్ ముసుగులో హైటెక్ వ్యభిచారం, ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలో సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైద్రాబాద్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైద్రాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సెలూన్లు, స్పాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్వాహకులపై పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు.
కానీ, ఈ తరహలో వ్యభిచారం కొనసాగిస్తున్న ఘటనలు కూడ కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి కూడ ఇదే తరహ ఘటన చోటు చేసుకొంది.మహిళలను పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

సెలూన్ ముసుగులో వ్యభిచారం
సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైద్రాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీనగర్ కాలనీలో సెలూన్ పేరుతో గుట్టుచప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.

సెలూన్, స్పాల ముసుగులో వ్యభిచారం
సెలూన్లు, స్పాల ముసుగులో హైద్రాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగు చూసింది. శ్రీనగర్ కాలనీలో సెలూన్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయమై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో మంగళవారం నాడు పోలీసులు ఆ సెలూన్పై దాడి చేశారు. నిర్వాహకుడు వెంకట్ రావు, కస్టమర్ లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కౌన్సిలింగ్ నిర్వహిస్తాం
యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గట్టుమల్లు తెలిపారు. ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు.

డబ్బు సంపాదన కోసం
డబ్బు సంపాదన కోసం ఈ తరహ మార్గాలను ఎంచుకొంటున్నట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. విలాసవంతమైన వారు నివసించే వారు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ఆ ప్రాంతాల్లో ఈ తరహ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications