ఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి చేసిన యువకుడు, అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఏకంగా పోలీసులపైనే తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. ఓ కేసు విషయమై దర్యాప్తు చేసేందుకు వెళ్లిన మాదాపూర్ పోలీసులపై నిందితుడు తల్వార్ తో దాడి చేయడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
ఓ హత్య కేసు విషయమై మాదాపూర్ ఎస్ఓటీ కానిస్టేబుళ్ళు రాజు, విజయ్ లు అల్విన్ కాలనీ డివిజన్లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే కరణ్ సింగ్ అనే సిక్కు యువకుడు తల్వార్తో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాజుకు ఛాతిపై, తలకు గాయాలయ్యాయి. విజయ్ స్వల్పంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడిన కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుళ్లను అడిషనల్ డీసీపీ రవికుమార్, డీసీపీ నారాయణ గౌడ్ పరామర్శించారు.
నిందితుడు కరణ్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్వార్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాను వచ్చింది పోలీసులు అని తెలియకనే.. దాడి చేశానని నిందితుడు కరణ్ సింగ్ చెబుతున్నారు. కానిస్టేబుళ్లు సివిల్ డ్రెస్ లో రావడంతో.. వారిని శత్రువులుగా భావించి దాడి చేసినట్లు తెలిపారు.
కాగా, ఔటర్ సర్వీస్ రోడ్ మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న వారిపై అర్ధరాత్రి తల్వార్లతో దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో గంధంగూడకు చెందిన కిషోర్ మృతి చెందగా, తులసి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారి దగ్గర నుంచి రూ.15 వేలు నగదును తీసుకుని పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తు విషయమై పోలీసులు దర్యాప్తు చేసేందుకు వెళ్లగా.. వీరిపైనా తల్వార్ దాడి జరగడం గమనార్హం.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications