ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా ఫేస్బుక్ పోస్టు... ఆ యూనివర్శిటీలో చెలరేగిన వివాదం
పుల్వామా దాడి జరిగి ఐదు రోజులు అయింది. దాడుల గాయాలనుంచి ఇంకా దేశం కోలుకోక ముందే.. హైదరాబాద్ సెంటల్రల్ యూనివర్శిటీలో ఓ ఫేస్ బుక్ పోస్టు టెన్షన్ వాతావరణం సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఓ విద్యార్థి సంఘం పోస్టు పెట్టడంతో ఉద్రిక్తత వాతావరణం క్యాంపస్లో నెలకొంది. ఈ పోస్టును పెట్టింది స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంఘం.
పార్లమెంటు పై దాడిలో సూత్రధారిగా నిలిచిన ఉగ్రవాది అఫ్జల్ గురుపై సుప్రీం కోర్టు తీర్పును ఫేస్బుక్ పోస్టులో ప్రస్తావించింది స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. అఫ్జల్ గురును ఉరితీస్తేనే దేశప్రజలందరూ సంతృప్తి చెందుతారని నాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో అఫ్జల్కు ఉరి అమలు చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ విద్యార్థులు పోస్టు చేస్తూ ఓ వివాదాస్పద ట్యాగ్ను ఉంచారు.

"రిమెంబరింగ్ అఫ్జల్ గురు, స్మాష్ కలెక్టివ్ కన్సైన్స్" అనే పదాలు ట్యాగ్లో చేర్చడంతో అసలు వివాదం తలెత్తింది. ఈ పోస్టును చూసిన బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ వెంటనే ఖండిస్తూ మరో పోస్టు పెట్టింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంస్థ పోస్టును ఏబీవీపీ ఖండిస్తోందని ఆ విద్యార్థి నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ అధ్యక్షుడు అభిషేక్.
అఫ్జల్ గురును గుర్తు చేసుకుంటే తప్పేముంది అని ప్రశ్నించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్టూడెంట్స్ ఇస్లాం విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఫసీ ప్రశ్నించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడులు జరిగి 40 మంది జవాన్లు అమరులైన తర్వాత ఇస్లామిక్ విద్యార్థి సంఘం ఫేస్బుక్లో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. ఎలాగైనా సరే పగతీర్చుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరి విద్యార్థులకు మెసేజ్లు వెళుతున్నట్లు సమాచారం.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications