సత్తా చాటిన తెలుగు మహిళ: మిసెస్ ఇండియా టైటిల్ సాధించిన హైదరాబాదీ
హైదరాబాద్: నగరానికి చెందిన మహిళ సత్తాచాటారు. 14 రాష్ట్రాల పోటీదారులను అధిగమిచి హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ.. మిసెస్ ఇండియా టైటిల్ సాధించారు. కొచ్చిలోని లే మేరిడియన్ హోటల్లో ప్రతిష్టాత్మక పోటీలు జరిగాయి.
ఈ పోటీలో తొలిసారి పాల్గొన్న హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ అంకితా ఠాకూర్ ఈ ఘనతను సాధించారు. తెలంగాణ ప్రతినిధిగా ఆమె మిసెస్ ఇండియా పోటీలో పాల్గొన్నారు. ఆమె అంతకుముందు మిసెస్ ఇండియా పోటీలో గెలిచిన రష్మిక ఠాకూర్ నుంచి శిక్షణ పొందారు.అంకిత హార్డ్ వర్క్, అంకితభావం, రష్మిక నుంచి శిక్షణ.. ఆమెకు ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను పొందడంలో సహాయపడ్డాయి.

అంకితా ఠాకూర్ తన మోడలింగ్ నైపుణ్యంతో పాటు తన ప్రైవేట్ ఆల్బమ్ 'డ్రామే నా దే'కి కూడా ప్రసిద్ది చెందారు. కాగా, మిసెస్ ఇండియా టైటిల్ గెలిచిన అంకితపై పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి అభినందనలు, ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతదేశం నలుమూలల నుంచి వివాహిత మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. దేశంలోని మహిళల బలం, అందం, తెలివితేటలను గుర్తించే ప్రతిష్టాత్మకమైన ఈవెంట్గా మిసెస్ ఇండియా పోటీ పరిగణిస్తారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications