బీజేపీ 'పద్మ'నూ వదలని వర్మ: హోమోసెక్సువల్ అన్నందుకు కేసు?..
Recommended Video

హైదరాబాద్: 'జీఎస్టీ'తొ వివాదాల్లో ఇరుక్కున ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. తనను టార్గెట్ చేసినవారిని చట్టపరంగానే ఎదుర్కోవడానికి సంసిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ ఉదయం నుంచి వరుసగా పలువురిపై ట్వీట్ చేస్తూ వస్తున్నారు. టీవి9పై కేసు పెట్టబోతున్నట్టు మొదట ఓ ట్వీట్ చేసిన వర్మ.. బీజేపీ నాయకురాలు తుమ్మలపల్లి పద్మపై కూడా కేసు పెట్టబోతున్నట్టు మరో ట్వీట్లో వెల్లడించారు.
వర్మ ట్వీట్:
బీజేపీ నాయకురాలు తుమ్మలపల్లి పద్మపైనా తాను కేసు పెట్టబోతున్నట్టు వెల్లడించిన వర్మ.. ఒకసారి ఆమె ఏమి మాట్లాడారో చూసుకోవాలని వీడియో లింక్ పోస్టు చేశారు.
కాగా, పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ తెరకెక్కించిన 'జీఎస్టీ'పై టీవి9 నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పద్మ మాట్లాడారు. వర్మను ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

పద్మ ఏమన్నారు:
'సిగ్గు లేని వాళ్లు.. అన్నీ వదిలేశామని చెప్పుకుంటున్నవాళ్లను ఎన్ కౌంటర్ చేయాలి. ఇంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? గతంతో సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్న సమయంలో ఓ యువతిపై యాసిడ్ పోస్తే.. నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. అలాంటి నాయకులు కావాలి మనకు ఈ రోజు. ' అని పద్మ అభిప్రాయపడ్డారు.

వర్మ.. హోమో సెక్సువల్:
'రాంగోపాల్ వర్మ హోమో సెక్సువల్ అని జై అనే డైరెక్టర్ మనందరి ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే అతను చేయలేని పనిని ఇలా చేసి అయినా (చిత్రం తీయడం ద్వారా) ఎక్కువ మందిని అలా తయారు చేయాలనుకుంటున్నట్టు ఉంది. అతనిలో సెక్సువల్ సామర్థ్యం లేదు. హోమో సెక్యువల్.' అని పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం నియంత్రించాలి..:
వర్మను ఎర్రగడ్డో, లేక వైజాగో తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. తెలంగాణ ప్రభుత్వం రమ్మీ తరహాలోనే దీన్నికూడా నియంత్రించాలి. ఇటువంటి వ్యక్తులను బయటి సమాజంలో తిరగనీయకూడదు అని పద్మ ఆ చర్చలో వర్మపై మండిపడ్డారు.
టీవి9కి చుక్కలు ..:
వర్మ తీరు చూస్తుంటే టీవి9ని ఇరుకునపెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుంది. జీఎస్టీ విడుదలవేళ.. 'పరమ బూతు' అంటూ చర్చా కార్యక్రమాలు నడిపిన ఆ చానెల్పై వర్మ లీగల్ యాక్షన్స్కు సిద్దమవుతున్నారు.
అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీవి9పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. టీవి9పై కేసు పెట్టేందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నింటిని తన లాయర్స్ సేకరించే పనిలో ఉన్నారని మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications