నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు, ఇలాగే ఉంటా: నారా బ్రాహ్మణి
తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని, హెరిటేజ్ ఎండీగానే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం నాడు చెప్పారు.
హైదరాబాద్: తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని, హెరిటేజ్ ఎండీగానే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం నాడు చెప్పారు.
హెరిటేజ్ సంస్థను స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడారు.
నంద్యాల టిక్కెట్ ఎవరికో చెప్పిన శిల్పా: అఖిల తేల్చేసింది.. మెత్తబడ్డారా
ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యమల్లా హెరిటేజ్ గ్రూప్స్ను అభివృద్ధి దిశగా నడిపించడమే అన్నారు. 2022 నాటికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6వేల కోట్లు చేయడం టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిపారు.
రోజుకు 14 లక్షల లీటర్ల పాలు అమ్మతున్నట్లు తెలిపారు. రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. 15 రాష్ట్రాలలో హెరిటేజ్ విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. పాలు, పెరుగు ఉత్పత్తిలో తాము ముందున్నామన్నారు. కాగా, భువనేశ్వరి చేతికి కట్టుతో మీడియా ముందుకు వచ్చారు.