భారీగా ఐఎఎస్ బదిలీలు: సోమేష్ కుమార్కు షాక్
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్గా ఉన్న సోమేశ్కుమార్ తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి బదిలీ చేసింది. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది.
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి సోమేశ్పై వచ్చిన ఆరోపణలు జాతీయ స్థాయికి చేరాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం ఇప్పటికే రాష్ట్రంలో విచారణ చేపడుతోంది. అఖిలపక్షంతో శనివారం ఈ బృందం సమావేశం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా జనార్దన్ రెడ్డిని నియమించింది.

జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్లుగా ఉన్న నవీన్ మిట్టల్, జి.కిషన్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ, వారి స్థానాల్లో ఎవరినీ నియమించలేదు. సోమేశ్ కుమార్తోపాటు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒక ఐఆర్ఎస్ సహా 22 మంది ఐఏఎస్లను బది లీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.
ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారు ఈసారి బదిలీ జాబితాలో చేర డం గమనార్హం. పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ శాఖల పరిధిలోనే ఈసారి ఎక్కువగా బదిలీలు జరిగా యి. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రేమండ్ పీటర్ను సీసీఎల్ఏగా నియమించారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications