హుస్నాబాద్ సభ విజయవంతం ఐతే కేటీఆర్ కి తలవంపులే..!!
హైదరాబాద్: కొంగర్ కలాన్ ప్రగతి నివేదన సభ.. ఇప్పుడది ముగిసిన అద్యాయం. ఆ సభ విజయం సాదించిందా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. గతాన్ని తలుచుకుని వగచి వగచి విలపించేకన్నా భవిశ్యత్తుపై భరోసాతో అడుగుముందుకు వేయడం ఉత్తమమని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఐతే వేలాది మంది తెలంగాణ ప్రజానికంతో మరో బహిరంగ సభ నిర్వహించి దాన్ని బ్లాక్ బస్టర్ చేసి కొంగర్ కలాన్ సభ చేసిన గాయం నుండి తేరుకోవాలని గులాబీ దళం సన్నాహాలు చేస్తోంది. సాద్యమైనంత తొందరగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రగతి నివేదన సభ ద్వారా కేసీఆర్ అసమర్ధత బహిర్గతమైందనే అపవాదును తొలగించుకోవాలని టీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

బావా బామ్మరుదుల సవాల్ గా మారిన సభలు..! హరీష్, కేటీఆర్ ల మద్య గట్టి పోటీ..!!
ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేయాలని కూడా టీఆర్ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు. అంతే కాకుండా ప్రగతి నివేదన సభ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన అపవాదును కూడా కడిగేసుకోవాలని గులాబీ నేత చంద్రశేఖర్ రావు ప్నణాళిక రచిస్తున్నారు. అందుకు కొడుకు కేటీఆర్ ను కాకుండా అల్లుడు హరీష్ ను రంగంలోకి దించుతున్నారు. ఇంత వరకూ కథ కథనం, దర్శకత్వం బాగానే ఉన్నా గులాబీ పార్టీలో ఇక్కడో ఊహించని భారీ ట్విస్ట్ చోటుచేసుకోబోతోంది. అందేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!

అటు అల్లుడు.. ఇటు తనయుడు.. మద్యలో నలుగుతున్న గులాబీ బాస్..!!
హుస్నాబాద్ ఆశిర్వాద సభ నిర్వహణ బాద్యతలు మొత్తం మంత్రి హరీశ్ రావు తన బుజాల మీద వేసుకున్నారు.వేదిక, జనసమీకరణ, సౌకర్యాలు, సభ విజయవంతం అన్నీ తానై నిర్వహిస్తున్నారు. కొంగర కలాన్ సభ ఎలా జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాల పట్ల హరీష్ రావు ఇసుమంతైనా ద్రుష్టి కేంద్రీకరించకపోబట్టే సభ అట్టర్ ఫ్లాప్ అయినట్టు వార్తలు ఘుప్పుమన్నాయి. దీంతో హుస్నాబాద్ సభ బాద్యతలను మొత్తం హరీష్ చూసుకుంటున్నారు. ఐతే కొంగరకలాన్ సభ ఫెయిల్ కావడంతో బాద్యతలు నిర్వహించిన మంత్రి కేటీఆర్ పైన దాని ప్రభావం పూర్తిగా పని చేసింది.

హరీష్ అనుభవం ముందు కేటీఆర్ తక్కువే..! అందుకు కొంగర్ కలాన్ ఉదాహరణ..!
ముఖ్యంగా జన సమీకరణ అంశంలో కేటీఆర్ ఘోరంగా విఫలం చెందారని, సభ సక్సెస్ చేయడమంటే ట్వీట్ చేసినంత సులభం కాదని గులాబీ పార్టీలోనే కెటీఆర్ ను టార్గెట్ చేస్తూ పెద్ద చర్చ జరిగింది. రేపు ఏడవ తారీఖులు ఆశీర్వాద సభ విజయవంతం ఐతే మాత్రం కెటీఆర్ కొంతవరకు ఆత్మన్యూనతా భావానికి గురికాక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ మేనేజ్ మెంట్ లో గాని, పోల్ మేనేజ్ మెంట్ లో గాని హరీష్ రావు కు మంచి పట్టుందని, తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక క్యాడర్ పెద్దయెత్తున హరీష్ కోసం పనిచేస్తుంటుందనే టాక్ వినిపిస్తోంది.

భంగపాటు కేటీఆర్ కే..!
అందుకే హరీష్ తెలంగాణలో ఏ మూలన కార్యక్రమం మొదలు పెట్టినా అది బ్లాక్ బస్టర్ కావిల్సిందే తప్ప ఫెయిల్ అవ్వదనే చర్చ కూడా నడుస్తోంది. కేటీఆర్ కు ఇంకా హరీష్ రావును అందుకునే స్థాయి రాలేదనే చర్చ కూడా జరుగుతోంది. రేపు హుస్నబాద్ సభ విజయవంతం అయిన తర్వాత హరీష్ పరిపక్వత, కెటీఆర్ పరిపక్వత బేరీజువేసుకునే వెసులు బాలు ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బావ బావమరుదుల రాజకీయ క్రీడలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నట్టు స్పష్టమౌతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications