video: కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటాః మంత్రి కేటీఆర్
మునుగోడు బై పోల్ క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. విమర్శలు- ప్రతీ విమర్శలతో మునుగోడు రాజకీయ వేడెక్కింది. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ఫైల్ చేశారు. కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన రోడ్ షోలో మాట్లాడారు.

దత్తత తీసుకుంటా..
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గ అభివృద్దిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను బలవంతంగా రుద్దిన ఎన్నిక అని కేటీఆర్ అన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. గత నాలుగేళ్లలో రాజగోపాల్ రెడ్డి ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు.

మంత్రిని కలిశారా..
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క సారైనా ఏ ఒక్క మంత్రినైనా కలిశారా? అని అడిగారు. పదేళ్ల క్రితం మునుగోడు.. ఇప్పుడెలా ఉందో చూడాలని ఓటర్లను కోరారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5లక్షల పరిహారం ఇస్తున్నామని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం నుంచి కాపాడింది కూడా కేసీఆరే అని చెప్పారు.
రూ.19 వేల కోట్లు అడిగితే..
ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం నల్లగొండ జిల్లాకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించిందని గుర్తుచేశారు. కానీ రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నిన్న మాణిక్కం ఠాగూర్ కూడా ఇలా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దానికి సంబంధించి గూగుల్ పే చేశారని.. వీడియోను కూడా పోస్ట్ చేశారు.

రూ.15 వేలు
మునుగోడులో ఓటర్లను ప్రలోభాలకు తెరతీశారు. మద్యం, మాంసం జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తున్నారని రాజకీయ నేతలే ఆరోపిస్తున్నారు. ఇంటికి తులం బంగారం కూడా పంపిణీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికను బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications